Krishna Ella-భారత వ్యాక్సిన్ తయారీదారుల సంఘం (ఐవిఎంఎ) ఏప్రిల్ 2024 నుండి రెండేళ్ల కాలానికి అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎం ఎల్లాను ప్రకటించింది.
2019 నుండి మార్చి 2024 వరకు పదవిలో ఉన్న అదార్ సి పూనావాలా నుండి ఎల్లా అధ్యక్ష పదవిని చేపట్టారని భారత్ బయోటెక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత 2 సంవత్సరాల కాలానికి, బయోలాజికల్ E మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వైస్ ప్రెసిడెంట్ గాను, T శ్రీనివాస్ భారత్ బయోటెక్ యొక్క CFO కోశాధికారిగా మరియు డాక్టర్ హర్షవర్ధన్ IVMA డైరెక్టర్ జనరల్గా కొనసాగుతారు.
“వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్యానికి కీలకమైన స్తంభం అని, ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు అనే దానితో సంబంధం లేకుండా, ప్రాణాలను రక్షించే వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉండేలా చూడడమే IVMA లక్ష్యం” అని ఎల్లా చెప్పారు, భారతదేశం మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజారోగ్యాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
IVMA సభ్యులు ఆఫ్రికన్ దేశాల ప్రజారోగ్య దృష్టికి మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు మరియు WHO మరియు US FDA లకు అనుగుణంగా విధానాలు మరియు నిబంధనలను రూపొందించాలని కోరారు,ఇది ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్ల పరిసమాలో పోటీగా ఉండటమే కాకుండా భారతదేశ దృష్టిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది అని అన్నారు.
21వ శతాబ్దపు సంక్లిష్ట సవాళ్లలో దిశా నిర్దేశం చేయటానికి డా. ఎల్లా (Krishna Ella) యొక్క నైపుణ్యం మరియు వ్యవస్థాపక స్ఫూర్తి టీకా పరిశ్రమకు ఖచ్చితంగా అవసరం.” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
పరిశ్రమ యొక్క పురోగతి మరియు లాభదాయకతకు సంబంధించిన భారతీయ ప్రైవేట్ రంగ మానవ వ్యాక్సిన్ తయారీదారుల ఆందోళనలను మరియు జాతీయ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్తో సంప్రదింపుల ద్వారా నియంత్రణ మార్గాలు మరియు ఆడిట్లు మరియు తనిఖీలకు సంబంధించిన విషయాలను క్రమబద్ధీకరించడం IVMA యొక్క లక్ష్యం
Read This Article In English