ఈ నెల 21 , 22 ల లో ముందుగా నిర్ణయించిన తన భారత పర్యటన టెస్లా భాద్యతల కారణంగా వాయిదా వేసుకున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ సందర్భగా ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఆసక్తి గా ఎదురు చూస్తన్నానని అన్నారు. ఏప్రిల్ 23న టెస్లా వార్షిక ఆర్ధిక ఫలితాలు విడుదల చేయాల్సి ఉండటం తో వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. గత ఏడాది జూన్లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, 2024లో భారత్ను సందర్శించాలని యోచిస్తున్నట్లు మస్క్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన ప్రతిపాదిత పర్యటనతో టెస్లా భారత్లో కార్యకలాపాలు ప్రారంభించే ప్రణాళికలను ప్రకటిస్తారనే అంచనాలు పెరిగాయి. .
ఎలోన్ మస్క్ భారత పర్యటన వాయిదా
38