వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుందని, ఆ పార్తీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ దాడి చేశారని, కరువు పరిస్థితులకు ఆయనే కారణమని రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి సరఫరా సహా అన్ని రంగాలకు 24×7 విద్యుత్ సరఫరా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకుని పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని అన్నారు
బీ ఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోతుంది – ఉత్తమ్ కుమార్ రెడ్డి
19