తెలంగాణలో అధికార కాంగ్రెస్ మే 13న జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గ ఉప ఎన్నికకు నారాయణ శ్రీ గణేష్ను అభ్యర్థిగా శనివారం ప్రకటించింది.ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు విడుదల చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి లాస్య నందిత మరణించిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితపై శ్రీ గణేష్ బీజేపీ టికెట్పై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.ఆయన ఇటీవలే కాంగ్రెస్లో చేరారు.