ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో ,8వ తేదీన ఎలమంచిలి నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి విజయ భేరీ యాత్రలో భాగంగా సభ నిర్వహిస్తారని జనసేన కార్యాలయం పత్రిక ప్రకటన లో తెలిపింది. అలాగే 9వ తేదీన పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పాల్గొంటారని తెలిపింది. తీవ్రమైన జ్వరం కారణంగా వారాహి విజయభేరి సభలకి విరామం ఇచ్చిన పవన్ కోలుకున్నారని 7వ తేదీ నుంచి యధావిధిగా ఎన్నికల ప్రచార యాత్రను కొనగిస్తారని తెలిపింది. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో ఖరారు చేస్తారని తెలిపింది.
7వ తేదీన అనకాపల్లి, 8న ఎలమంచిలిలో జనసేనాని సభలు
22
previous post