బిజెపి “రిజర్వేషన్ మరియు సామాజిక న్యాయానికి” వ్యతిరేకమని, కేంద్రంలో మరోసారి కాషాయ పార్టీ అధికారం లోకి వస్తే దేశంలో “రిజర్వేషన్ వ్యవస్థ” ఉండదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు. విక్రవాండిలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ, బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రమాదం ఉందని అన్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలను దేశ రెండవ స్వాతంత్ర్య ఉద్యమంగా అభివర్ణిస్తున్నారని అన్నారు.
దేశం చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని,వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన తరగతులు (ఎంబిసిలు), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మైనారిటీల రిజర్వేషన్లకు ప్రమాదం ఉంది” అని తమిళనాడులోని ఉత్తర జిల్లాలో ఓటర్లను ఉద్దేశించి ఆయన ఆరోపించారు. కాగా ఇది గణనీయమైన MBC జనాభాను కలిగి ఉంది.
ఇంకా ఆయన మాట్లాడుతూ “ఇది ఎలాంటి ముప్పు? నేను రెండు ఉదాహరణలు చెబుతాను: కేంద్ర ప్రభుత్వంలో వెనుకబడిన తరగతులకు చెందిన కార్యదర్శులు మూడు శాతం కూడా లేరు. నేటికీ, కేంద్ర-ప్రభుత్వ అధీనంలోని ఉన్నత విద్యాసంస్థల్లో, ఆశావహులు OBCలకు, SC మరియు STలు రిజర్వేషన్ల ద్వారా ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టులకు ఎంపిక చేయబడరు అని అన్నారు.
వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన గత రెండు మూడు తరాల ప్రజలు మాత్రమే చదువుకుని గౌరవప్రదమైన ఉద్యోగ స్థానాలను పొందారని అన్నారు. ఇది కేవలం రిజర్వేషన్లు మరియు పోరాటం ద్వారా సామాజిక న్యాయం సాధించాం’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
ఎన్ని పోరాటాలు చేసినా నేటికీ అటువంటి అన్ని వర్గాలకు పూర్తి, సముచిత ప్రాతినిధ్యం లభించలేదని గుర్తు చేశారు. దానికి బాధ్యులెవరు.. బీజేపీయే.. రిజర్వేషన్ వ్యవస్థను ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన ఆరోపించారు.
హక్కు అయిన రిజర్వేషన్ను సాధించుకోవడం కోసం ప్రతిసారీ పోరాటం చేయాల్సి వస్తుంది అన్నారు. రిజర్వేషన్లు మరియు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బిజెపి ఉంది అన్నారు. బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ ఉండదని, సామాజిక న్యాయాన్ని పాతిపెట్టి, మన ప్రజలను 100 ఏళ్లు వెనక్కు తీసుకు వెళ్తారని అందుకే బీజేపీని వ్యతిరేకిస్తున్నాం’’ అని డీఎంకే చీఫ్ వివరించారు.ఇక్కడ అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఎంబిసిలకు చెందిన వన్నియార్లు కీలకమైన ఓటు.