ఆదివారం ముంబై లో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది, ప్రపంచ నంబర్ వన్ టి20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు.
డిసెంబర్లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ తర్వాత కోలుకుని ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నుండి క్లియరెన్స్ పొందిన సూర్యకుమార్ జట్టుతో చేరారు. ఆయన రాకతో ఈ సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు బాటింగ్ ఆర్డర్ బలంగా తయారైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ వారి ప్లేయింగ్ ఎలెవన్లో రెండు మార్పులు చేసింది. గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో పేసర్ ఝే రిచర్డ్సన్,రసిఖ్ దార్ స్థానంలో ఆల్ రౌండర్ లలిత్ యాదవ్ వచ్చారు
జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (వికెట్ కీపర్ అండ్ కెప్టెన్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఝే రిచర్డ్సన్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.