టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విదిత్ గుజరాతీని ఓడించాడు. మహిళల విభాగంలో ఆర్ వైశాలి కూడా ఈ ఈవెంట్లో తొలి విజయం సాధించింది. ఇంకా 11 రౌండ్లు మిగిలి ఉండగా, పురుషుల విభాగంలో ఫాబియానో కరువానా, డి గుకేష్ మరియు ఇయాన్ నెపోమ్నియాచ్చి రెండు పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నారు, గుజరాతీ మరియు ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మహిళల ఈవెంట్లో, జోంగీ టాన్ రెండు పాయింట్లతో ఆధిక్యం లో ఉండగా ,గోరియాచ్కినా, హంపీ, వైశాలి, లగ్నోల 1.5 పాయింట్లతో రెండవ స్థానం లో నిలిచారు.
విదిత్ గుజరాతీపై గెలిచినా ఆర్ ప్రజ్ఞానంద
28
previous post