చంద్రబాబే కోర్టు లో పెటేషన్ వేసి పింఛన్లు ఆపి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో జోగి రమేష్ మాట్లాడారంటూ ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేత వార్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దానికి సంబందించిన వీడియో క్లిప్ ను కూడా ఆయన తన ఫిర్యాదు కాపీ కి జత చేశారు . ఆ వీడియో ను పరిశీలించిన ఈసీ మంత్రి జోగి రమేష్ కు నోటీసు లు జారీ చేసింది.
అలాగే వాలంటీర్ల సేవల నిలిపివేతకు చంద్రబాబు కారణమంటూ చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ పై ఈ నెల 1 వ తారీఖున వార్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ పోస్టు ఎన్నికల నియమావళి కి విరుద్ధం అని ధృవీకరించిన ఎన్నికల కమిషన్ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేసిన 48 గంటలలో జోగి రమేష్ మరియు లేళ్ల అప్పిరెడ్డి వివరణ ఇవ్వాలంటూ తన నోటిసులలో పేర్కొంది
మంత్రి జోగి రమేష్,లేళ్ల అప్పిరెడ్డికి సీఈఓ ముకేశ్ కుమార్ మీనా నోటీసులు
31