ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల ఖాతాలకు ఏటా రూ.లక్ష బదిలీ చేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడంపై విశ్వాసం వ్యక్తం చేఇస్నా ఆయనఆ నిరుద్యోగ యువకులకు గ్యారెంటీతో కూడిన ట్రైనింగ్ కల్పిస్తామని, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు చెల్లించే డబ్బులను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.
భారతదేశంలోని ప్రతి నిరుద్యోగ యువకుడికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ ఉండేలా ఒక చట్టాన్ని రూపొందించాలని కాంగ్రెస్ యోచిస్తోందని, ఆ సమయంలో వారికి భత్యంగా రూ. 1 లక్ష లభిస్తుందని గాంధీ పేర్కొన్నారు. అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన తర్వాత, వారి పనితీరు సంతృప్తికరంగా ఉంటే వారికి అదే స్థలంలో ఉద్యోగం లభిస్తుంది అని అన్నారు.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగాల్లో కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి పలకాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది అన్నారు. రైతులు తమ పంటలకు తగిన ఎమ్మెస్పీని పొందేలా చట్టాన్ని రూపొందించాలని కూడా పార్టీ యోచిస్తోందన్నారు.
ఆదివాసీ గిరిజనులను వారి భూమి నుండి తరిమివేయటానికి మరియు నీరు, అడవి మరియు భూమిపై వారికున్న హక్కును లాక్కోవడానికి “ఆదివాసీ”లకు బదులుగా “వనవాసీలు” అని బిజెపి పిలుస్తోందని గాంధీ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు వారి భూములు ఇవ్వాలని బీజేపీ భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.